Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో కాన్పులో ముగ్గురు పిల్లలు

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (09:52 IST)
చిత్తూరు జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. గుర్రంకొండ మండలం తుమ్మలగొందికి చెందిన ఎం.స్వర్ణలతకు శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో 108కు సహాయంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రి బయల్దేరారు.

అయితే, మార్గమధ్యలోనే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత ఆస్పత్రిలో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురు చిన్నారులు, తల్లి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. సాధారణ కాన్పులోనే ముగ్గురు చిన్నారులకు జన్మనివ్వడం విశేషమన్నారు.

స్వర్ణలత, శివకుమార్‌ దంపతలకు మొదటి కాన్పులో లాస్య (5), రెండో కాన్పులో ఉమశ్రీ (3) ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఓ బాబు, ఇద్దరు పాపలు జన్మించారు. మొత్తం ఐదుగురు సంతానం. సాధారణంగా మొదటి కాన్పులోనే ఇలా ముగ్గురు కవలలు జన్మిస్తారని, మూడో కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం మాత్రం చాల అరుదని వైద్యులు చెప్తున్నారు.

గతంలో కూడా ఇలాంటి కాన్పులు జరిగాయి. నలుగురు, ఐదుగురు పిల్లలు పుట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments