Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతిలో జగన్ గృహప్రవేశం

Webdunia
బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (15:13 IST)
ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గృహ ప్రవేశం చేశారు. అమరావతికి సమీపంలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి ఆయన సతీసమేతంగా ప్రవేశించారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. రాజధాని ప్రాంతంలో తమకంటూ సొంత ఇల్లు ఉంటే పార్టీ కార్యకలాపాలకు కూడా బాగుంటుందనే అభిప్రాయంతో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు. 
 
గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో నూతనంగా నిర్మించిన ఇంటికి బుధవారం ఉదయం జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతితో కలిసి సతీసమేతంగా గృహ ప్రవేశంచేశారు. ఈ సందర్భంగా నూతన గృహంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమంలో జగన్ తల్లి విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులతో పాటు పార్టీ ముఖ్య నేతలైన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిధున్ రెడ్డి, రోజా, పార్థ సారధి తదితరులు పాల్గొన్నారు.
 
గృహ ప్రవేశం అనంతరం ఆ పక్కనే నిర్మించిన వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments