Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేటి టూర్ షెడ్యూల్ ఇదే...

Webdunia
మంగళవారం, 28 మే 2019 (14:01 IST)
వైసీపీ అఖండ విజయం సాధించిన నేపధ్యంలో మరికొద్ది గంటల్లో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు జగన్ నేడు తిరుమలకు రానున్నారు. ప్రత్యేక విమానంలో నేటి సాయంత్రం 6.30 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని రోడ్డు మార్గం ద్వారా తిరుమల చేరుకుంటారు. 
 
ఈ రాత్రికి పద్మావతి గెస్ట్ హౌస్‌లో బసచేస్తారు. రేపు ఉదయం 8.15 గంటలకు శ్రీవారిని దర్శించుకుని 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి 11.00 గంటలకు కడప చేరుకుంటారు. 11.30 నుండి 11.45 వరకు కడప నగరంలోని ప్రఖ్యాత పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం 12.15 గంటలకు కడప నుండి పులివెందులకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాణిస్తారు. 
 
అక్కడ సీఎస్ఐ చర్చిలో కుటుంబసభ్యులతో కలిసి ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాత నుంచి 1.30 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని  దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. సాయంత్రం 4.30 వరకు ఇడుపులపాయలో గడిపి 4.30 గంటలకు ఇడుపులపాయ నుంచి కడప విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానం ద్వారా సాయంత్రం 6 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి రాత్రి 7.30 నిమిషాలకు తాడేపల్లిలో తమ నివాసానికి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

Janhvi Kapoor: జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్

జన్మదినంనాడు రామ్ పోతినేని 22వ చిత్రం టైటిల్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments