Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభిస్తున్న హెచ్3ఎన్2 వైరస్ ... ఇప్పటికే ముగ్గురు మృతి

Webdunia
మంగళవారం, 14 మార్చి 2023 (15:00 IST)
దేశంలో కొత్త వైరస్ హెచ్3ఎన్2 వైరస్ విజృభిస్తుంది. ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య ఏడుకు చేరింది. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వారు వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నమోదైంది. ఈ వైరస్ బారినపడిన 58 యేళ్ళ ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. అయితే, ఈమె అప్పటికే అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతూ వచ్చినట్టు సమాచారం.
 
అలాగే, కర్నాటక, హర్యానా రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్కరు చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. హెచ్3ఎన్2 వైరస్ అనేది ఏ ఉప రకం. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతున్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ వైరస్ సోకినవారికి జలుబు, శరీర నొప్పులు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే, ఈ వైరస్ క్రమంగా రోగి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుందని వైద్యులు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఈ వైరస్ బారినపడి ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments