దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (09:50 IST)
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మరోమారు స్వల్పంగా పెరిగాయి. గురువారంతో పోల్చితే కేసుల సంఖ్య 3.4శాతం పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 36,571 పాజిటివ్‌ కేసులు దేశంలో నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
అలాగే, ఈ వైరస్ బారి నుంచి 39,157 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 530 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,23,22,258కు పెరిగింది. ఇందులో 3,15,25,080 మంది బాధితులు కోలుకున్నారు.
 
ఇదిలావుంటే, యాక్టివ్‌ కేసుల సంఖ్య 150 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 3,63,605 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ చెప్పింది. జాతీయ రికవరీ రేటు 97.54 శాతానికి పెరిగిందని, రోజువారీ పాజిటివిటీ రేటు 1.94శాతంగా ఉందని పేర్కొంది. 
 
టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 57.22 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసింది. ఇప్పటి వరకు 50.26 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Priyadarshi: ప్రియదర్శి నటిస్తున్న ఇడుపు కాయితం విడుదల తేదీ ఫిక్స్

Aishwarya: రహస్యాన్ని దాచి తిరు వీర్, ఐశ్వర్య ను పెళ్లి చేసుకుంటే ఏమయింది?

Nagarjuna: తిరుమల వేంకటేశ్వరుడే అఖిల్ కు సక్సెస్ ఇచ్చాడు : అక్కినేని నాగార్జున

అఖిల్ అక్కినేని 'లెనిల్' తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా?

లెనిన్ అదుర్స్.. పండగ చేసుకుంటున్న జైనాబ్.. తొలి రోజు 16.7కోట్ల కలెక్షన్ (video)

తర్వాతి కథనం
Show comments