Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : భారత్ - న్యూజిలాండ్ సెమీస్ పోరు .. ఏపీలో భారీ స్క్రీన్లపై ప్రదర్శన

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (13:58 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో నాకౌట్ పోటీలైన సెమీస్ పోరు జరుగుతుంది. తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ను ఏపీలోని మూడు నగరాల్లో భారీ స్క్రీన్లపై లైవ్ టెలికాస్ట్ చేసేలా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేశారు. విశాఖ, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్లపై ఈ లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఇక్కడ ఒకేసారి ఏకంగా పది వేల మంది కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్ స్టేడియం, కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేందుకు వీలుగా ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijaysai Reddy: తిరుమల దర్శనం.. మొక్కులు- బీజేపీలో చేరనున్న విజయ సాయిరెడ్డి? (video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్వల్ప అస్వస్థత.. ఏమైందంటే? (video)

ఆలయంలోకి వచ్చాడని దళిత యువకుడిని నగ్నంగా ఊరేగించారు.. ఎక్కడ?

WAVES సమ్మిట్‌- ఏపీకి ఏఐ సిటీ.. రూ.10వేల కోట్లతో డీల్ కుదిరింది

AP: ఏపీలో మే 6 నుంచి జూన్ 13 వరకు ఆన్‌లైన్ ఎంట్రన్స్ పరీక్షలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

తర్వాతి కథనం
Show comments