Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ టోర్నీకి దూరమవుతున్న ఒక్కో క్రికెటర్.. ఎందుకని?

Webdunia
ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (08:49 IST)
కరోనా రెండో దశ వ్యాప్తి కారణంగా నిలిచిపోయిన ఐపీఎల్ టోర్నీ అక్టోబరు నెలలో దుబాయ్ వేదికగా పునఃప్రారంభంకానుంది. అయితే, ఈ టోర్నీ ప్రారంభానికి ముందే ఒక్కో క్రికెటర్ క్రమంగా దూరమవుతున్నారు. ఇప్పటికే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో, పంజాబ్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ మలన్‌, దిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌ రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ వ్యక్తిగత కారణాల దృష్ట్యా మిగతా సీజన్‌కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
 
తాజాగా ‘ఐపీఎల్‌-2021 మిగతా సీజన్‌లో డేవిడ్‌ మలన్‌ ఆడటం లేదు. టీ20 ప్రపంచకప్, యాషెస్‌ సిరీస్‌ వెంట వెంటనే ఉండటంతో.. అతడు తన కుటుంబంతో కొంత సమయం గడపాలనుకుంటున్నాడు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్‌ అడెన్‌ మార్క్రమ్‌ ఆడనున్నాడు’ అని పంజాబ్‌ కింగ్స్‌ యాజమాన్యం ట్వీట్‌ చేసింది. 
 
అలాగే, భారత జట్టు సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో ఐదు టెస్టుల సిరీస్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో ఆటగాళ్లను ఆయా జట్ల యాజమాన్యాలు ప్రత్యేకంగా దుబాయి తరలిస్తున్నాయి. దుబాయిలో ఆరు రోజుల క్వారంటైన్‌ అనంతరం ఆటగాళ్లు తమ జట్టు సభ్యులతో చేరనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Malala Yousafzai: భారతదేశం-పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలి.. మలాలా యూసఫ్ జాయ్

Operation Sindoor impact: పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది.. ఈ యుద్ధాన్ని చివరి వరకు తీసుకెళ్తాం

Rahul Gandhi: రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం సవాలు- పిటిషన్ కొట్టివేత

India: 25 వైమానిక మార్గాలను నిరవధికంగా మూసివేసిన భారత్

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

తర్వాతి కథనం
Show comments