Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార నిందింతులకు ప్రజాప్రతినిధి ఆశ్రయం

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (15:38 IST)
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన కేసులోని నిందింతులకు ఓ ప్రజాప్రతినిధి తన ఫామ్ హౌస్‌లో ఆశ్రయం కల్పించినట్టు వార్తలు వస్తున్నాయి. శనివారం రాత్రి కర్నాటకలోని గుల్బర్గాలో ఉన్న ఒక మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఆ కుర్రోడిని ఓ రహస్య ప్రాంతానికి తరలించి విచారించారు. అలాగే, మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు చేసిన నిందితుల సంఖ్య ఐదుకు చేరిన విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో ఉన్న ఒక ఫాంహౌస్‌లో వద్ద ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఓ రాజకీయ పార్టీ నేతకు చెందిన ఫాంహౌస్‌లోనే తలదాచుకున్నారని, అక్కడ నుంచి వేర్వేరు ప్రాంతాలకు పరారయ్యారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. పైగా, తాము వినియోగించిన ఇన్నోవా కారును కూడా ఆ ఫాంహౌస్ వెనుక భాగంలో వారు దాచిపెట్టారు. 
 
అంతేకాకుండా, అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో ఇద్దరికి కొత్త సిమ్ కార్డులు వేసి గోవాకు పంపించినట్టు తెలిపారు. ఆ తర్వాత మరికొందరు కర్నాటకకు పారిపోయారు. ఆశ్రయం ఇచ్చిన ఫాంహౌస్ యజమాని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ కేసులో అరెస్టు చేసిన ఓ నిందితుడికి చెందిన ఫాంహౌస్‌గా భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments