Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలి కోసం ఖర్చు చేసిన లెక్కలు రాసిపెట్టి ప్రియుడు ఆత్మహత్య

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (08:14 IST)
ఆ యువతిని ఓ యువకుడు తొమ్మిదేళ్ళగా ప్రేమిస్తున్నాడు. ఆమె కోసం రూ.4.50 లక్షల వరకు ఖర్చు చేశాడు. కానీ, ఇంతలో ఏమైందో ఏమోగానీ ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా, తన ప్రియురాలి కోసం ఖర్చు చేసిన రూ.4.50 లక్షలను వసూలు చేయాలంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టిమరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరులో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చేతన్ (31) అనే యువకుడు శంకరపురకు చెందిన ఓ యువతిని తొమ్మిదేళ్లుగా ప్రేమిస్తూ వచ్చాడు. సరకు రవాణా వాహనాన్ని నడుపుతూ జీవితాన్ని గడుపుతూ వచ్చిన చేతన్.. తన ప్రియురాలి సరదాలు తీర్చేందుకు తన వేతనంలో సగం జీతం ఖర్చు చేసేవాడు. తన ప్రియురాలు సంతోషంగా ఉంటే చాలని చేతన్ భావించాడు. 
 
కానీ, ఆమె మాత్రం అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికిగురైన చేతన్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలి సంతోషాల కోసం తాను ఖర్చు చేసిన రూ.4.50 లక్షలను ఆమె నుంచి వసూలు చేయాలంటూ సూసైడ్ లేఖ రాసిపెట్టి చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments