Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామయ్యా, అమ్మ మరొకడితో ఆటోలో ఎక్కి వెళుతోంది: దారి కాచి హత్య చేశారు

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (19:52 IST)
తన సోదరి వేరొకరితో అక్రమ సంబంధం సాగిస్తుందని తెలిసి ఆ వ్యక్తిని హత్య చేసాడు ఆమె సోదరుడు. తన వెంట మరో ముగ్గురుని తీసుకుని వచ్చి అక్రమ సంబంధం నెరపుతున్న వ్యక్తిని చనిపోయేవరకూ కొట్టి చంపాడు. ఆ తర్వాత అతడి శవాన్ని తీసుకుని నేరుగా పోలీసు స్టేషనుకి వెళ్లి లొంగిపోయాడు.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. బెంగళూరులోని కోలారు జిల్లా మాలూరుకి చెందిన ఓ మహిళ వస్త్ర పరిశ్రమలో ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకి రెండేళ్ల క్రితం తమిళనాడుకి చెందిన భాస్కర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దసరా పండుగ రోజు కూడా ఈ విషయమై భర్త ఆమెను నిలదీశాడు. దాంతో ఆగ్రహంతో ఆమె తన కుమారుడిని తీసుకుని బెంగళూరు వచ్చేసింది.

 
మరుసటి రోజు తన ప్రియుడితో కలిసి ఆటోలో ఎక్కి వెళ్లింది. దీన్ని గమనించిన ఆమె కుమారుడు విషయాన్ని తన మేనమామకి చేరవేశాడు. అంతే... ఆ మహిళ సోదరుడు మునిరాజు తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్తున్న వారిద్దరినీ అటకాయించారు.

 
ఆటో నుంచి తన సోదరిని కిందకు దించి ఇంటికి పంపారు. ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం సాగిస్తున్న భాస్కర్ ను గొడ్డును బాదినట్లు బాదారు. ఆ దెబ్బలకు తాళలేక అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి శవాన్ని తీసుకుని పోలీసు స్టేషనుకి వెళ్లి లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

దుబాయ్‌ ఫ్యూచర్‌ మ్యూజియంలో అలీకి లైఫ్‌టైమ్‌ ఎఛీవ్‌మెంట్‌ అవార్డు

రాకేష్ ఒక ఛాలెంజ్ గా బ్లైండ్ స్పాట్ సినిమా చేశాడు : నవీన్ చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments