Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ ఒక్క ఖాకీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : టీడీపీ నేత యరపతినేని

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (19:06 IST)
2024లో జరిగే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, ఆ తర్వాత తమను వేధించిన, తమపై తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్క పోలీస్ అంతు చూస్తామని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు హెచ్చరించారు. 
 
ఇటీవల మాచర్ జిల్లాలో వైకాపా నేతలు చేసిన దమనకాండపై ఆయన మాట్లాడుతూ, మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలకు పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని తెలిపారు. మాచర్లలో జరిగిన అల్లర్లతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు భయపెడుతున్నారన్నారు. పైగా, మాచర్లలో సైతం భయానక వాతావరణం సృష్టిస్తున్నారని తెలిపారు. 
 
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే టీడీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టిన, పెడుతున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్, అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైకాపా ఆరిపోయే దీపమని, రానున్న రోజుల్లో వైకాపా నేతలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. అదేసమయంలో వైకాపా నేతలు, పోలీసులు కుమ్మక్కై వేధింపులకు గురిచేసినా టీడీపీ కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments