Webdunia - Bharat's app for daily news and videos

Install App

చక్కెర వ్యాధికి స్వీట్ రూల్స్, ఇలా చేస్తే డయాబెటిస్ అదుపులో...

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (21:21 IST)
డయాబెటిస్, చక్కెర వ్యాధి లేదా మధుమేహంతో బాధపడే రోగులు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించి తీరాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ వ్యాధి బారినపడినవారు ఆహార నియమం గురించి పడే తపన అంతాఇంతా కాదు. అందుకే ముందుగానే ఆహార నియమం కోసం కొన్ని ప్రణాళికలను తయారు చేసుకుంటే చాలా మంచిది. అలాంటి ప్రణాళికా నియమాలు ఇలా ఉండాలంటున్నారు వైద్యులు.
 
ఉదయం 6 గంటలకు: అర చెంచా మెంతి పొడిని నీటిలో కలిపి సేవించాలి.
ఉదయం 7 గంటలకు: టీ తాగే అలవాటుంటే చక్కెర లేని టీ తీసుకోవచ్చు.
ఉదయం 8.30 గంటలకు: ఒక ప్లేటు ఉప్మా లేదా గోధుమ రవ్వతో చేసిన ఉప్మాతోబాటు అరకప్పు మొలకెత్తిన విత్తనాలు, 100 మిల్లీలీటర్ల చక్కెరలేని పాలను ఆహారంగా తీసుకోవాలి.
ఉదయం 10.30 గంటలకు: 50 గ్రాములున్న పండు లేదా 1 కప్పు పలుచటి మజ్జిగ లేదా చక్కెర లేకుండా నిమ్మకాయ రసంను సేవించాలి.
 
మధ్యాహ్నం భోజనం 12.30 గంటలకు: రెండు చపాతీలు, ఒక కప్పు గంజి తీసివేసిన అన్నం, ఒక కప్పు పప్పు, ఒక కప్పు పెరుగు, అర కప్పు సోయాబీన్ లేదా పనీర్, అరకప్పు ఆకుకూరతో పాటు సలాడ్ ఒక కప్పును ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.
 
సాయంత్రం 4 గంటలకు: ఒక కప్పు చక్కెర లేని టీతో పాటు రెండు బిస్కెట్లు తీసుకోవచ్చు(చక్కెర లేనివి).
సాయంత్రం 6 గంటలకు: ఒక కప్పు సూపు తీసుకోవాలి.
రాత్రి భోజనం 8.30 గంటలకు: మధ్యాహ్నం తీసుకున్న ఆహారం మాదిరాగానే రాత్రిపూట కూడా తీసుకోవాలి.
రాత్రి పడుకునే సమయంలో 10.30 గంటలకు: ఒక కప్పు చక్కెర లేని పాలు సేవించాలి.
 
ఒక్కసారిగా ఆహారాన్ని సమపాళ్ళల్లో తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత విపరీతంగా ఆకలి వేస్తుంటుంది. అలా ఆకలి వేస్తే ఈ సూత్రాలు పాటించండి. పచ్చి కూరగాయలు సలాడ్‌గా తీసుకోవాలి. బ్లాక్ టీ, సూప్, పలుచటి మజ్జిగ, నిమ్మకాయ రసం సేవిస్తుండాలి. ఇందులో ముఖ్యంగా చక్కెర, బెల్లం, తేనె, తీపి పదార్థాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments