Webdunia - Bharat's app for daily news and videos

Install App

గజగజ వణికిపోయిన అమెరికా.. చర్చలకు రావాలంటూ ఉ.కొరియాకు ఆహ్వానం

అగ్రరాజ్యం అమెరికా వణికిపోయింది. ఉత్తర కొరియా ఇచ్చిన వార్నింగ్‌కు బిత్తర పోయింది. తమ వద్ద ఉన్న క్షిపణులతో అమెరికా యుద్ధ నౌకలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో అమెరికా దిగివచ్చి.. ఉత్తర కొరియాను

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (11:55 IST)
అగ్రరాజ్యం అమెరికా వణికిపోయింది. ఉత్తర కొరియా ఇచ్చిన వార్నింగ్‌కు బిత్తర పోయింది. తమ వద్ద ఉన్న క్షిపణులతో అమెరికా యుద్ధ నౌకలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించింది. దీంతో అమెరికా దిగివచ్చి.. ఉత్తర కొరియాను ద్వైపాక్షిక చర్చలకు ఆహ్వానించింది. 
 
ఉత్తర కొరియా సముద్ర జలాల్లో జపాన్, అమెరికాలు సైనిక విన్యాసాలు చేయాలని భావించాయి. ఇందుకోసం భారీ ఎత్తున యుద్ధనౌకలను అమెరికా తరలించింది. దీనిపై ఉత్తర కొరియాపై కన్నెర్రజేసింది. క్షిపణులతో దాడులు చేస్తామని సిద్ధమైంది. 
 
దీంతో ఓ మెట్టు దిగిన అమెరికా... చర్చలకు రావాలని ఉత్తర కొరియాను కోరింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుని, ఉద్రిక్త పరిస్థితులను మార్చేందుకు ప్రయత్నించాలని, ఇందుకోసం చర్చిద్దామని కోరుతూ పెంటగాన్‌ ప్రతినిధులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 
 
ఇంటర్నేషనల్ ఒప్పందాలను దృష్టిలో ఉంచుకుని, చర్చల ద్వారా సానుకూలత సాధించేందుకు ఉత్తర కొరియా ముందుకు రావాలని, అస్థిరతను పెంచే యత్నాలు కూడదని హితవు పలికింది. చట్ట విరుద్ధంగా క్షిపణులను పరీక్షించడం తమ దేశ భద్రతకు బెదిరింపుగా భావిస్తున్నామని, ఈ విషయంలో మరిన్ని అడుగులు ముందుకు వేయవద్దని సూచించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments