Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాక్ మాజీ ప్రధాని కుమార్తె అరెస్ట్

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:19 IST)
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె, పీఎంఎల్ఎన్ పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌ ను పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. చౌద్రీ సుగర్ మిల్స్ కేసులో పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో అధికారులు గురువారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
లోహోర్‌లోని కోట్ లక్‌పత్ జైల్లో ఉన్న తన తండ్రిని కలుసుకునేందుకు మరియం నవాజ్ వెళ్తుండగా అధికారులు అరెస్ట్ చేసినట్టు పాక్ మీడియా తెలిపింది. అయితే గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తనంత తానే ఎన్ఏబీ కార్యాలయానికి వెళ్లాలని భావించినప్పటికీ ఈలోగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇకపోతే అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో మరియం నవాజ్, ఆమె భర్త, తండ్రి నవాజ్ షరీఫ్ లు జైల్లో గడిపారు. కొద్దినెలల క్రితం ఈ ముగ్గురు జైలు నుంచి విడుదల అయ్యారు. విడుదలైన కొద్దిరోజుల్లోనే అల్ అజీజియా స్టీల్ మిల్స్ కేసులో నవాజ్ షరీఫ్ మళ్లీ అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన లాహోర్ జైల్లో ఉన్నారు. తాజాగా మరియం నవాజ్ ను ఎన్ఏబీ అధికారులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments