మహారాష్ట్రలో ఘోరం : భవనం కూలి 15 మంది మృతి

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (10:45 IST)
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలో విరార్ ప్రాంతంలోని ఓ భవనం కూలిపోవడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. ఈ ఘటనలో భవనం యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
విరార్‌లోని నారింగ్ ఫాటా వద్ద ఉన్న రాము కాంపౌండ్‌లోని రమాబాయి అపార్టుమెట్ భవనం నాలుగో అంతస్తుకు చెందిన వెనుక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. ఆ శిథిలాలు పక్కనే ఉన్న ఒక చాల్ మీద పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విరార్ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, రెండు జాతీయ విపత్తు స్పందన దళం బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. 
 
సహాయక చర్యలు చేపట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశాయి. అయినప్పటికీ 15 మంది ప్రాణాలు కోల్పోయారుు. గాయపడిన వారిని విరార్, నలసోపారోలేని ఆస్పత్రులకు తరలించారు. కొందరికి ప్రాథమిక చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. సుమారు పదేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనాన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గతంలోనే గుర్తించి హెచ్చరికలు జారీచేసినట్టు సమాచారం. శిథిలాల కింద మరికొందరు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

Satyaprakash: రాయలసీమ భరత్ నటించిన జగన్నాథ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments