Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్.. హైదరాబాద్ టు పాట్నా... జాతీయ రాజకీయాలపై చర్చ

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2022 (15:00 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ బుధవారం బిహార్ రాష్ట్ర పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి పాట్నాకు ఆయన వెళ్లారు. గతంలో ప్రకటించిన మేరకు ఇండోచైనా సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ లోయలో జరిగిన ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణంలో పలువురు భారతీయ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ అమర వీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు ఆయన బిహార్ రాష్ట్రానికి వెళ్లారు. ఈ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన ఒక్క అమరవీరుని కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. 
 
అలాగే, ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా సీఎం ఆర్థిక సాయం చేస్తారు మరణించిన ఒక్కో వలస కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందజేస్తారు. బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి ఈ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేస్తారు. 
 
ఆ తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. ఈ మీటింగ్‌పైనే ఇపుడు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు చర్చ సాగుతోంది. జాతీయ రాజకీయాలపైనే వీళ్లిద్దరూ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఏయే అంశాలపై చర్చిస్తారన్న అంశంపై క్లారిటీ లేదు. అలాగే వారిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
మరోవైపు, అటు బిహార్, ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. బిహార్‌లో బీజేపీతో పొత్తును తెగదెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఇటు తెలంగాణాలో కూడా రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేసీఆర్ తనయ కవిత పేరును సీబీఐ ప్రస్తావించింది. ఇపుడు ఈ అంశం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments