Webdunia - Bharat's app for daily news and videos

Install App

online games ఆడి అప్పుల్లో ఇరుక్కున్నాడు, అడిగినందుకు భార్యాపిల్లల్ని చంపేసి...

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (18:37 IST)
వ్యసనం అనేది ఎంతటి దారుణానికైనా దారితీస్తుంది. అందులో ఇరుక్కున్నవారికి మానవత్వం నశించి మృగంలా మారిపోతారు. అలాంటి స్థితిలోకి వెళ్లిపోయిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లల్ని కడతేర్చి తను కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నైలోని పెరుంగుడి పెరియార్ నగర్ లోని ఓ అపార్టుమెంటులో మణికంఠన్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు. చెన్నైలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న ఇతడు గత రెండు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే వుంటూ ఆన్లైన్ గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు.

 
ఇందుకోసం డబ్బును పెట్టి రాబట్టాలని చూసాడు. ఐతే ఆ గేమ్ ఆడుతూ వున్న డబ్బు మొత్తం పోగొట్టుకోవడమే కాకుండా తనకు తెలిసిన వ్యక్తుల వద్ద కూడా అప్పులు చేసాడు. ఈ విషయమై అతడిని భార్య నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి భార్యను హత్య చేసేసాడు.

 
ఆ తర్వాత తన ఇద్దరి పిల్లల్ని కూడా దారుణంగా చంపేసి అతడూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన 31వ తేదీ జరగ్గా, తెల్లవారినా తలుపులు తీయకపోవడంతో అనుమానంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారమిచ్చారు. అపార్టుమెంట్ తలుపులు తెరిచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments