Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారాల రాజధానిగా భారత్ : రాహుల్ గాంధీ

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (10:01 IST)
దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. అత్యాచారాల రాజధానిగా భారత్ మారిందంటూ ఆరోపించారు. దేశంలో పెరుగుతున్న లైంగికదాడుల ఘటనలను చూసి ప్రపంచ సమాజం భారత్‌ను 'రేప్‌లకు రాజధాని' అంటూ ఎద్దేవా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
తన లోక్‌సభ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌లో మూడు రోజులు పర్యటనను ముగించుకున్న రాహుల్‌ శనివారం ఓ సదస్సులో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. నరేంద్ర మోడీ రాజకీయ జీవితమంతా ద్వేషం, విభజన, హింసపై ఆధారపడి ఉన్నదని విమర్శించారు. 'ప్రతి రోజు ఓ యువతి లైంగికదాడికి లేదా హత్యకు గురైందన్న వార్తను చదివినప్పుడు తల్లులు, అక్కాచెల్లెళ్లు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అంతర్జాతీయ సమాజం నేడు భారత్‌ను చూసి అవహేళన చేస్తున్నది. భారత్‌ను లైంగికదాడులకు రాజధాని అని ఎద్దేవా చేస్తున్నది' అంటూ వ్యాఖ్యానించారు. 
 
బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాక్షాత్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సెంగర్‌పై నమోదైన లైంగిక దాడి కేసును ప్రస్తావిస్తూ, 'బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే లైంగికదాడికి పాల్పడినా ప్రధాని పెదవి విప్పరు. బాధితురాలు, ఆమె బంధువులు ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొన్నా ప్రధాని మాట్లాడరు. మీ కుమార్తెలను మీరెందుకు కాపాడుకోలేకపోతున్నారని విదేశాలు మనలను ప్రశ్నిస్తున్నాయి' అంటూ రాహుల్ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం