Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాకు మరో షాక్? 350 విదేశీ వస్తువులపై బ్యాన్?

Webdunia
సోమవారం, 13 జులై 2020 (10:30 IST)
చైనాపై భారత్ మరోమారు కన్నెర్రజేసింది. గాల్వాన్ లోయలో చైనా బలగాల బరితెగింపునకు నిరసనగా చైనాకు చెందిన 59 యాప్స్‌పై భారత్ నిషేధం విధించింది. ఇందులో అత్యంత ప్రజాధారణ పొందిన టిక్ టాక్ యాప్ కూడా ఉంది. దీంతో చైనా యాప్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఈ క్రమంలో చైనాకు భారత్ మరోమారు షాకిచ్చింది. మొత్తం 350 రకాల విదేశీ వస్తువులపై భారత్ నిషేధం విధించింది. 
 
ఇవన్నీ చైనా కంపెనీలు ఉత్పత్తి చేసే వస్తువులే కావడం గమనార్హం. తాజాగా నిషేధం విధించిన వస్తువులలో ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, టాయ్స్, ఫర్నీచర్ తదితర వస్తువులు ఉన్నాయి. ఇకపై భారత్ నిషేధం విధించిన వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే పలు రకాలైన ఆంక్షలను అధికమించాల్సిందే. 
 
ఇప్పటికే చైనా వస్తువుల వల్ల దేశ భద్రకు ముప్పు వాటిల్లుతోందని రక్షణ రంగ నిపుణులు పదేపదే హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇందులోభాగంగా, చైనాకు చెందిన 59 రకాల యాప్స్‌పై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ బాటలో అగ్రరాజ్యం అమెరికా కూడా నడువనుంది. ఇపుడు మరో 350 రకాల వస్తువులపై నిషేధం విధించడంతో చైనా కంపెనీలకు అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశాల్లో భారత్‌ను కోల్పోవాల్సివచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

జగదేక వీరుడు అతిలోక సుందరి క్రేజ్, రూ. 6 టికెట్ బ్లాక్‌లో రూ. 210

ప్రతిరోజూ 1000శాతం కృషి చేస్తారు.. బాలయ్య గురిం ప్రగ్యా జైశ్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments