Webdunia - Bharat's app for daily news and videos

Install App

Omicron rules: కర్ణాటకలో వ్యాక్సిన్ వేయించుకోకపోతే.. నో ఎంట్రీ?

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (09:09 IST)
Omicron
దేశవ్యాప్తంగా ఒమైక్రాన్ టెన్షన్ మొదలైంది. బెంగళూరులో రెండు కేసులు.. హైదరాబాద్ వచ్చిన మహిళకు పాజిటివ్ వున్నట్లు తేలింది. దీంతో కర్ణాటక సర్కారు కోవిడ్‌కు సంబంధించిన ఆంక్షలు జారీ చేసింది. ఇందులో కరోనా వ్యాక్సినేషన్ వేసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు వీలు లేదని స్పష్టం చేసింది. పార్కులు, షాపింగ్ మాల్స్, థియేటర్లు వంటి ప్రదేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోని వారు తిరిగేందుకు వీల్లేదని వెల్లడించింది. 
 
కొత్త ఉత్తర్వులు వచ్చే ఏడాది జనవరి 22 వరకు వుంటుందని కర్ణాటక సర్కారు తెలిపింది. అలాగే పాఠశాలల్లో ఎలాంటి సమావేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధించింది. ముఖ్యమైన సమావేశాలు, వివాహాలకు పాల్గొనే వారి సంఖ్యను 500 మందికి మాత్రమే పరిమితం చేయాలి. అన్ని విద్యా సంస్థలలో అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, ఫంక్షన్‌లు జనవరి 15, 2022 వరకు వాయిదా వేయబడతాయి.
 
పాఠశాలలు లేదా కళాశాలలకు వెళ్లే 8 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించాలి. షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు మరియు థియేటర్లలోకి కోవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్న వ్యక్తులకు మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుంది. మాస్కులు ధరించని పక్షంలో రూ.250 ఇతర ప్రాంతాల్లో రూ.l00 జరిమానా విధించడం జరుగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments