Webdunia - Bharat's app for daily news and videos

Install App

సహజీవనంలో తేడా... ప్రియురాలిని చంపేసిన ప్రియుడు

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (11:06 IST)
నమ్మిన వ్యక్తులను దారుణంగా చంపేయడం ఈమధ్య ఎక్కువైంది. తనే సర్వస్వం అంటూ వచ్చిన కట్టుకున్న భార్యలను కొందరు హతమారుస్తుంటే.. తన లోకంగా ప్రేమించే ప్రియురాళ్లను మరికొందరు పొట్టనబెట్టుకుంటున్నారు. తాజాగా ముంబైలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తనతో సహజీవనం చేస్తున్న మహిళనే ఓ ప్రియుడు దారుణంగా చంపిన ఘటన ముంబైలో వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే... ముంబైలోని మన్‌పద ప్రాంతంలో 26 ఏళ్ల జయశ్రీ తన భర్తతో గొడవలు కారణంగా విడాకులు తీసుకుని వేరుగా వుంటోంది. ఈ క్రమంలో ఆమెకు 30 ఏళ్ల సక్పాల్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆమెకు సాయం అందిస్తున్నట్లుగా మంచిగా నటించాడు. అది కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఐతే ఎందుకో ఈమధ్య ఆమెతో గొడవపడటం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు ఎక్కువయ్యాయి. వాటిని తట్టుకోలేని జయశ్రీ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని హెచ్చరించి పంపారు. ఐతే అతడి బుద్ధి మాత్రం మారలేదు. మళ్లీ ఆమెతో గొడవపెట్టుకున్నాడు. ఆ గొడవలో తీవ్ర ఆగ్రహానికి గురైన సక్పాల్ పదునైన కత్తి తీసుకుని ఆమెను నరికాడు. దాంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. వెంటనే ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా జయశ్రీ శవం కనిపించింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments