Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి ప్రధాని మోడీ బర్త్‌డే విషెస్

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (16:24 IST)
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ తన 96వ పుట్టిన రోజు వేడుకలను మంగళవారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ప్రధాని మోడీ, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌లు ఢిల్లీలోని అద్వానీ నివాసానికి వెళ్లి విషెస్ చెప్పారు. ఆ తర్వాత అద్వానీతో కూర్చుని పలు అంశాలపై మోడీ చర్చించారు. ఈ సందర్భంగా వారు తీసిన ఫోటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 
 
1927 నవంబరు 8వతేదీన పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో జన్మించిన అద్వానీ.. దేశ విభజన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ప్రచారక్‌గా పని చేసి ఆ సంస్థలో అంచలంచెలుగా ఎదిగారు. తదనంతరం జన సంఘ్‌లో చేరిన అద్వానీ జన సంఘ్‌ను భారతీయ జనతా పార్టీగా మార్చి కీలక భూమిక పోషించారు. 
 
1990 దశకంలో దేశ రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావం చూపలేని బీజేపీ అద్వానీ చేపట్టిన రథయాత్రతో ఏకంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత ప్రధానిగా అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఉప ప్రధానిగా ఎల్కే. అద్వానీలు బాధ్యతలు చేపట్టారు. వాజ్‌పేయి జీవించివున్నంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహించిన అద్వానీ.. మోడీ సారథ్యంలోని బీజేపీ నేతృత్వంలో పూర్తిగా తెరమరుగై ఇన ఇంటికే పరిమితమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments