Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకటించిన తేదీల్లోనే పీజీ నీట్ పరీక్ష - తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (16:14 IST)
దేశంలోని పీజీ వైద్య కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కొందరు విద్యార్థుల కోసం ఎక్కువ మంది విద్యార్థులు నష్టం కలిగించేలా ఆదేశించలేమని పేర్కొంది. వాయిదా వేస్తే ఇప్పటికే పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు నష్టపోతారని వ్యాఖ్యానించింది. 
 
పరీక్ష కోసం దాదాపు 2.06 లక్షల మందికి పైగా విద్యార్థులు సన్నద్ధమవుతున్నారని, ఇలాంటి సందర్భంలో పరీక్ష వాయిదావేసి వారికి నష్టం చేకూర్చలేమని పేర్కొంది. అలా చేయడం వల్ల ఆస్పత్రుల్లో వైద్యుల కొరత వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 
 
పీజీ నీట్‌ను వాయిదా వేయాలని పేర్కొంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. నీట్ పీజీతో పాటు ఏ యేడాది కౌన్సెలింగ్ తేదీలు క్లాష్ అవుతున్నాయని, అందుకే వాయిదా వేయాలని కోరుతున్నామని పిటిషనర్ల తరపు అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, సుప్రీంకోర్టు మాత్రం అందుకు నిరాకరించింది. 
 
ఇప్పటికే అకడమిక్ షెడ్యూల్ నాలుగు నెలలు ఆలస్యమైందని, కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకని నీట్ 2022-23ను ఆలస్యంగా ప్రకటించారని ధర్మాసనం పేర్కొంది. పీజీ నీట్‌ను వాయిదా వేయాలని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు కూడా 2021 నీట్ పీజీ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారని, వారు నీట్ 2022 రాయకుండా ఎవరూ అడ్డుకోలేదని ధర్మాసనం గుర్తుచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments