Webdunia - Bharat's app for daily news and videos

Install App

దత్తత తీసుకున్న పాపానికి.. ప్రేమికుడితో కలిసి ద్రోహం చేసింది..

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (16:59 IST)
దత్తత తీసుకున్న ఇంటికే తన ప్రేమికుడితో కలిసి ఎసరు పెట్టింది.. ఓ యువతి. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు కన్యాకుమారి సమీపంలో మూవాట్టుకోణం అనే ప్రాంతానికి చెందిన జయకుమారి.. తన భర్తను కోల్పోయింది. ఆమె ఒంటరిగా జీవిస్తోంది. జయకుమారి దంపతులకు సంతానం లేకపోవడంతో.. తనకు తోడు కావాలని శ్రీన (19) అనే యువతిని దత్తత తీసుకుంది. 
 
శ్రీనయ ఓ కాలేజీలో చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుని తిరిగివస్తానని చెప్పిన శ్రీనయ ఇంటికి చేరుకోలేదు. ఇంకా ఆమె సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయ్యింది. అంతేగాకుండా.. ఇంట్లోని కోట్లాది విలువ చేసే పత్రాలు, బ్యాంక్ లాకర్ తాళాలు, సీక్రెట్ నెంబర్లు, పలు లక్షల విలువ గల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి.
 
దీన్ని గమనించిన జయకుమారి షాకైంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో శ్రీనయ షాలూ (23) అనే యువకుడిని ప్రేమిస్తోందని.. అతడితో కలిసి తిరుగుతుందని తెలుసుకున్నారు. జయకుమారికి చెందిన నగలను బ్యాంకు లాకర్ నుంచి తీసుకుని మోసానికి పాల్పడిన శ్రీనయపై బ్యాంకు అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శ్రీనయ, షాలూలను అరెస్ట్ చేశారు. ఈ ఘటన కన్యాకుమారి ప్రాంతంలో పెను సంచలనానికి దారితీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: సమంత శుభం అదుర్స్.. రామ్ చరణ్ కితాబు

Vishal: అస్వస్థతకు గురైన హీరో విశాల్.. స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు.. (video)

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments