Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమతా బెనర్జీ పార్టీలో చీలిక.. ఆరుగురు ఎమ్మెల్యేలు గుడ్‌బై?

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. దీంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా.. త్రిపురకు చెందిన ఎమ్మెల

Webdunia
గురువారం, 6 జులై 2017 (10:31 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రపతి ఎన్నికలు చిచ్చుపెట్టాయి. దీంతో ఆ పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఏర్పడింది. ముఖ్యంగా.. త్రిపురకు చెందిన ఎమ్మెల్యేల్లో ఆరుగురు భారతీయ జనతా పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 
 
దీనికి కారణం లేకపోలేదు. రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న మీరా కుమార్‌కు మమతా బెనర్జీ మద్దతు పలికారు. దీన్ని త్రిపుర రాష్ట్రానికి చెందిన ఆరుగురు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో వీరంతా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
సీపీఎం మద్దతు తెలిపిన మీరాకుమార్‌కు ఓటేయడానికి వారు నిరాకరిస్తున్నారు. త్వరలోనే వారు బీజేపీలో చేరనున్న‌ట్లు స‌మాచారం. శుక్రవారం ఆ ఆరుగురు అస్సోంలోని గౌహ‌తిలో జరిగే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్ సభలో పాల్గొన‌నున్నారు. వీరంతా గతేడాది కాంగ్రెస్‌ నుంచి వచ్చి టీఎంసీలో చేరారు. ఇప్పుడు బీజేపీలోకి వెళ్ల‌డానికి సిద్ధమవుతున్నారు.    
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments