అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఇకలేరు...

ఠాగూర్
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (12:10 IST)
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ (85) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తూ వచ్చారు. వీటికితోడు ఆయన షుగర్, రక్తపోటు వంటి సమస్యలు కూడా ఉండటంతో లక్నోలోని ఓ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ రాగా, ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. గురువారం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. 
 
1992 డిసెంబరు 6వ తేదీన బాబ్రీ మసీదు కూల్చివేసిన సమయంలో సత్యేంద్ర దాస్ తాత్కాలిక రామమందిరానికి పూజారిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనే విగ్రహాలను సమీపంలోని ఫకీర్ మందిర్‌‍కు తీసుకెళ్లారు. కూల్చివేతల తర్వాత ఆ విగ్రహాలను మళ్లీ రామజన్మభూమికి తీసకొచ్చి తాత్కాలిక మందిరంలో ఉంచారు. 
 
సత్యేంద్రదాస్ 20 యేళ్ల వయసులోని నిర్వాణి అఖాడాలో చేరి ఆధ్యాత్మిక దీక్షను తీసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సం, బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సమంయలో కీలకంగా వ్యవహరంచారు. ప్రస్తుతం రామాయల ప్రధాన పూజారిగా వ్యవహరిస్తూ తుదిశ్వాస విడిచినట్టు ఆయన శిష్యుడు ప్రదీప్ దాస్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments