Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోనులో టార్చర్ - భార్య కారుకు నిప్పు పెట్టిన ఐటీ ఉద్యోగి

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:34 IST)
కట్టుకున్న భార్య ఫోన్ చేసి టార్చర్ చేయడాన్ని తట్టుకోలేక పోయాడు. దీంతో భార్య కారుకు నిప్పుపెట్టాడు. ఈ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న మరో నాలుగు బైకులకు నిప్పు అంటుకుని కాలిబూడిదయ్యాయి. ఈ సంఘటన చెన్నై నగర శివారు ప్రాంత నెర్కుండ్రంలో జరిగింది. దీంతో ఐటీ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై నెర్కుండ్రం షణ్ముఖనగర్‌ సత్యం వీధిలో గత నెల 25న ఒక కారు, నాలుగు బైకులు నిప్పు అంటుకుని దగ్ధమయ్యాయి. దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో స్థానికంగా నివాసం ఉండే సతీష్‌ (26)ను పోలీసులు అరెస్టు చేశారు.
 
పోలీసులు వివరణలో చెన్నై అంబత్తూరు ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సతీష్‌ 2019 నుంచి భార్య వెండామనితో విడిపోయాడు. అప్పటినుంచి తల్లి ఇంటిలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య అతనికి తరచూ ఫోన్‌ చేసి వేధింపులకు గురిచేస్తూ ఉండడంతో విరక్తి చెందాడు. 
 
భార్యపై ప్రతీకారం తీర్చుకునేందుకు గాను ఆమె కారుకు నిప్పు పెట్టాడు. ఈ మంటలు విస్తరించి సమీపంలోని కారు, నాలుగు బైకులు దగ్ధం చేశాయి. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ విషయం స్థానికంగా సంచలనం కలిగించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి హీరోయిన్ రాశీ సింగ్ గ్లింప్స్ రిలీజ్

వరుస సినిమాలు సిద్ధమవుతున్న డ్రింకర్ సాయి ఫేమ్ హీరో ధర్మ

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments