రంగారెడ్డిలో ఆటో బోల్తా... ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు

Webdunia
సోమవారం, 22 నవంబరు 2021 (16:13 IST)
రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆటో బోల్తా ప‌డటంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే జిల్లాలోని కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా ప‌డింది. 
 
ఈ ప్ర‌మాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోలో మొత్తం ఇరవై మంది విద్యార్థున్నట్లు సమాచారం. విద్యార్థులంతా ముజాహిద్ పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన జ‌రిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Toxic : యశ్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో టాక్సిక్ .రిలీజ్ డేట్ పోస్టర్

Ravi Teja: మధ్యతరగతి తండ్రి-కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఇరుముడి చిత్రం

Venkatesh: కత్తిలాంటి ఐడియా ఎలా వుంటుందో అనిల్ కు చూపించిన విక్టరీ వెంకటేష్

మా ఇంటి బంగారంగా సాయిపల్లవిని అనుకున్నారు.. కానీ సమంతనే సెట్ అయ్యారు

హైదరాబాద్ నా రెండవ ఇల్లు.. రామ్ పోతినేనితో ప్రేమ వల్లే భాగ్య శ్రీ అలా చెప్పిందా?

తర్వాతి కథనం
Show comments