తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త కోర్టులు

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (14:59 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త కోర్టులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్తగా 57 కోర్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
మొత్తం 57 కోర్టులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కేడర్లలో ఈ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యతో పాటు కొత్త కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న కోర్టులపై కూడా పనిభారం పెరిగింది. 
 
ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొత్త కోర్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా కొత్తగా 57 కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 
చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేకంగా 10 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నల్గొండ, ఎల్బీనగర్, వరంగల్ ప్రాంతాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మ.. షో మ్యాన్..మ్యాడ్ మాన్స్టర్

Shivaj :ఓవర్సీస్ ప్రీమియర్లతో సిద్ధం చేస్తున్న ధండోరా

Dhanush: కృతి స‌న‌న్ తో ప్రేమలో మోసపోయాక యుద్ధమే అంటున్న ధనుష్ - అమ‌ర‌కావ్యం (తేరే ఇష్క్ మై)

అఖండ 2 డిసెంబర్ 12న వస్తోందా నిర్మాతలు ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments