Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురికి జీవదానం చేసిన వివాహిత... ఎలా?

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2023 (12:47 IST)
ఓ వివాహిత నలుగురి ప్రాణదానం చేశారు. ఇంట్లో పనులు చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆ వివాహిత అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో నలుగురు ప్రాణదానం పొందారు. మృతురాలి పేరు గండ్ర హరిత (26). తాను చనిపోతూ నలుగురికి పునర్జన్మ ఇచ్చింది. 
 
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన గండ్ర హరిత భర్తతో కలిసి హైదరాబాద్ నగరంలో తన భర్తతో కలిసి ఉంటున్నారు. ఈమె భర్త యశ్వంత్ రెడ్డి హైదరాబాద్ నగరలోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరుగా పని చేస్తున్నారు. ఈ దంపతులకు పది నెలలో చిన్నారి కూడా ఉంది. 
 
ఈ నేపథ్యంలో గత నెల 29వ తేదీన ఇంట్లో పనులు చేస్తూ ఉన్నట్టుండి తలనొప్పింగా ఉందని చెప్పి కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సికింద్రాబాద్‌లోని సన్ షైన్ ఆస్పత్రికి తరలించగా, ఆమెను పరీక్షించిన వైద్యులు బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. 
 
జీవన్ దాన్ ప్రతినిధులు హరిత భర్త, ఇతర కుటుంబ సభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించడంతో వారు అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో హరిత కిడ్నీలు, కాలేయం, ఊపరితిత్తులు, నేత్రాలు సేకరించిన వైద్యులు... ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో నలుగురికి అమర్చారు. దీంతో హరిత చనిపోయినప్పటికీ.. ఆ నలుగురి రూపంలో ఆమె బతికే ఉంటుందని చెప్పారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments