Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ రూ.15 కోట్లు.. కలెక్షన్లు రూ.25 కోట్లు... ఆ హీరో - దర్శకుడికి వాటాల్లో లాభాలు!

సుదీర్ఘకాలం తర్వాత సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు తేజ. దగ్గుబాటి రానా హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". ఈ చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం బడ్జెట్ రూ

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2017 (13:56 IST)
సుదీర్ఘకాలం తర్వాత సూపర్ డూపర్ హిట్ కొట్టిన దర్శకుడు తేజ. దగ్గుబాటి రానా హీరోగా తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ నిర్మించిన చిత్రం "నేనే రాజు నేనే మంత్రి". ఈ చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం బడ్జెట్ రూ.16 కోట్లు. కానీ, ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో మంచి మార్కులు కొట్టేయడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించింది.
 
ముఖ్యంగా, కథా.. కథనాలతో పాటు రానా పాత్రను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దాంతో విడుదలైన అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా విజయవిహారం చేసేసింది. అంచనాలకి మించి భారీ వసూళ్లను రాబట్టేసింది.
 
దాంతో ఈ సినిమాకి ఇప్పటికే రూ.25 కోట్ల వరకూ లాభాలు వచ్చాయని తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం లాభాల్లో వాటాగా దర్శకుడు తేజకు.. హీరో రానాకు చెరో రూ.5 కోట్లు వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. 
 
లాభాల్లో వాటా సంగతి అటుంచితే తేజ .. రానాల కెరియర్లో ఒక వైవిధ్యభరితమైన చిత్రంగా 'నేనే రాజు నేనే మంత్రి' నిలిచిపోయిందనే విషయం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్ నటించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Quetta: బలూచిస్థాన్ రాజధాని క్వైట్టాను ఆధీనంలోకి తీసుకున్న బీఎల్ఏ

Pakistani drones: భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్ డ్రోన్లు- భారత ఆర్మీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జీతం మొత్తం అనాధ పిల్లలకు ఇచ్చేశారు

Chardham Yatra: పాకిస్తాన్ దాడుల ముప్పు: చార్‌ధామ్ యాత్రను నిలిపివేసిన భారత సర్కారు

Hyderabad: పది లక్షల రూపాయల్ని కాజేసిన కిలేడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments