Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతిలోకసుందరి శ్రీదేవి కన్నుమూత: సోషల్ మీడియా కన్నీరు

ప్రముఖ సినీనటి, అతిలోకసుందరి శ్రీదేవి కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ హిందీ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీదేవి శనివారం అర్ధరాత్రి దాటక దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందార

Webdunia
ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (09:00 IST)
ప్రముఖ సినీనటి, అతిలోకసుందరి శ్రీదేవి కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళ హిందీ చిత్రపరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీదేవి శనివారం అర్ధరాత్రి దాటక దుబాయ్‌లో గుండెపోటుతో మృతి చెందారు. దశాబ్ధాల పాటు చిత్రపరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా రాణించిన శ్రీదేవి మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఆమె మరణవార్త తెలిసి దేశం మొత్తం మూగబోయింది. 
 
సినీ ప్రేక్షకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బాలీవుడ్ నటుడు మోమిత్ మార్వా వివాహం కోసం భర్త బోనీకపూర్‌, చిన్న కుమార్తె ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి గుండెపోటుతో మరణించినట్లు సంజయ్ కపూర్ ధ్రువీకరించారు. శ్రీదేవి మరణవార్త తెలిసిన ప్రముఖులు ఆమె ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ''దడాక్'' చిత్ర షూటింగ్‌ కారణంగా ముంబైలోనే వున్న శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి విషయం తెలిసిన వెంటనే దుబాయ్ వెళ్లిపోయినట్టు సమాచారం.
 
శనివారం రాత్రి దుబాయ్ లో ప్రముఖ సినీ నటి శ్రీదేవి తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో సోషల్ మీడియా కంటతడి పెడుతోంది. శ్రీదేవి మరణవార్తతో యావత్ సినీ ప్రపంచం, అభిమానులు షాక్‌కు గురయ్యారు.  పెళ్లివేడుకకు భర్త బోనీ కపూర్‌తో వివాహానికి హాజరైన సందర్భంగా శ్రీదేవి ఆనందంగా, హుషారుగా కనిపించారు. శ్రీదేవి మరణవార్తపై సోషల్ మీడియాలో పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె మరణాన్ని నమ్మలేకపోతున్నామంటూ కొందరు కన్నీరు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments