Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర జవాన్ల కుటుంబాలకు అమితాబ్ భారీ ఆర్థికసాయం

Webdunia
ఆదివారం, 17 ఫిబ్రవరి 2019 (10:51 IST)
బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ నిజంగానే రియల్ హీరో అని మరోమారు అనిపించుకున్నారు. గతంలో పలుమార్లు కూడా తాను రీల్ హీరో కాదనీ, రియల్ హీరో అని నిరూపించుకున్నారు. తాజాగా మరోమారు ఆయన ఇదేవిధంగా నడుచుకున్నారు.
 
జమ్మూకాశ్మీర్లో సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌పై జ‌రిగిన ఉగ్ర‌దాడిలో ఇప్పటివ‌ర‌కు 49 మంది జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుటుంబాలకు అండగా నిలిచేందుకు చాలా మంది సెలెబ్రిటీలు తమ వంతు సాయం చేసందుకు ముందుకు వస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, పుల్వామా దాడిలో అసువులు బాసిన వీరజవాన్ల కుటుంబాలలో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున విరాళంగా మొత్తం రూ.2.5 కోట్లు ప్రకటించారు. టాలీవుడ్ నుంచి విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా త‌న‌కి తోచినంత సాయాన్ని వీర‌జ‌వాన్ల కుటుంబాల‌కు ప్రకటించారు.
 
గతంలో దేశానికి వెన్నుద‌న్నుగా నిలిచిన రైత‌న్నని ఆదుకొని ఎంద‌రికో మార్గ‌ద‌ర్శ‌కంగా నిలిచారు. మ‌హారాష్ట్రకి చెందిన 350 మంది రైతుల లోన్స్‌ని మాఫీ చేయించాడు. ఉత్తర ప్ర‌దేశ్‌లోని రైతు కుటుంబాల‌కి చెందిన వారి లోన్స్ మాఫీ కోసం అమితాబ్ 4.05 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టారు. 
 
అలాగే, బ‌ల‌వంతంగా వ్య‌భిచార గృహాల్లోకి నెట్టి వారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసే వారి నుంచి యువ‌తుల‌ని ర‌క్షించి వారి కోసం పాటు ప‌డుతున్న అజీత్ సింగ్‌కి కూడా అమితాబ్ కొంత మొత్తం ఇస్తామ‌ని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments