Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండుగా చీరలో కనిపిస్తా... కాస్త మసాలా చేర్చుతాం.. సీక్రెట్ లవర్ లేదు: రష్మీ గౌతమ్

బుల్లితెరపై యాంకర్‌గా వెలుగొందుతూ అడపాదడపా వెండితెరపై నటిస్తున్న రష్మీ గౌతమ్.. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా నెక్ట్స్‌ నువ్వే చిత్రంలో ఓ నాయికగా నటించింది.

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (16:45 IST)
బుల్లితెరపై యాంకర్‌గా వెలుగొందుతూ అడపాదడపా వెండితెరపై నటిస్తున్న రష్మీ గౌతమ్.. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా నెక్ట్స్‌ నువ్వే చిత్రంలో ఓ నాయికగా నటించింది. ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా ప్రభాకర్‌ దర్శకత్వంలో వి4 పతాకంపై బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. 
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రష్మీ మాట్లాడుతూ.. ఇందులో చాలా గ్లామరస్‌గా కనిపిస్తానని చెప్పుకొచ్చింది. చాలా రోజుల తర్వాత చీరకట్టుకుని నటించే పాత్ర లభించిందని.. ఎక్కువ సేపు చీరలోనే వుంటానని తెలిపింది. 
 
హాట్‌ డైలాగ్స్‌, సినిమాలో సందర్భానుసారమైన కామెడీలో కనిపిస్తానని రష్మీ చెప్పుకొచ్చింది. శృంగారం ఎక్కువున్న పాత్రలే వస్తున్నాయి కాబట్టి నటిస్తున్నానని రష్మీ తెలిపింది. తానైతే అలాంటి రోల్స్ కోరుకోవట్లేదని తెలిపింది. జబర్దస్త్ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌పై రష్మీ స్పందిస్తూ .. పెద్దవాళ్లు ఆ షో చూసినప్పుడు వారికి తెలుసు షో నుంచి ఏది తీసుకోవాలో.. ఏది తీసుకోవద్దోనని తెలిపింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయనే ఆ షోను 9.30 గంటలకు ప్రసారం చేస్తున్నారని బదులిచ్చింది.
 
సుడిగాలి సుధీర్‌తో అఫైర్ లేదని రష్మీ క్లారిటీ ఇచ్చింది.. కొన్ని వెబ్‌సైట్లు క్లిక్స్ బిజినెస్‌ కోసం ఏదో రాస్తుంటారని.. తనకు వ్యక్తిగత జీవితముందని.. జబర్దస్త్, ఢీ షో క్రేజ్ పెంచడానికి మేము కొంత మసాలా చేర్చుతాం. దాన్ని చూసి ఏదో అనుకొంటారు. ఏదేదో ఊహించుకొంటారని.. అది మా తప్పు కాదని రష్మీ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

నాకో చిన్నపిల్లాడున్నాడు.. దయచేసి వదిలేయండి ప్లీజ్... : భరత్ భూషణ్ ఆఖరి క్షణాలు..

పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చి అత్యాచారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం కాస్తా?

Telangana: కర్రెగుట్ట కొండలపై ఎన్‌కౌంటర్: ఆరుగురు మావోయిస్టులు మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments