Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ 'సాహో' కలెక్షన్లు : పది రోజుల్లో రూ.400 కోట్ల గ్రాస్...

Webdunia
సోమవారం, 9 సెప్టెంబరు 2019 (14:18 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. ఈ చిత్రం విడుదలై పదిరోజులు అయింది. ఈ పది రోజుల్లో సాహో చిత్రం ఏకంగా రూ.400 కోట్ల మేరకు గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.
 
ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటించగా, సుజిత్ దర్శకత్వం వహించారు. మొత్తం నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం కథాకథనాల పరంగా అంచనాలను అందుకోలేక నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కానీ, ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది.
 
ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో అనేక ప్రాంతాల్లో కొత్త రికార్డులను సృష్టించింది. ఫలితంగా 10 రోజుల్లో రూ.400 కోట్లకి పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. తొలి రోజునే నెగెటివ్ టాక్ వచ్చినా, నాలుగు భాషల్లో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషం. లాంగ్ రన్‌లో ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను చేరుకోవచ్చనే సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న బలూచిస్థాన్ - ఇటు భారత్ కూడా..

కుమార్తెతో కలిసి నీట్ ప్రవేశ పరీక్ష రాసిన తల్లి!

ఆఫీస్ ముగించుకుని అందరూ ఇంటికెళ్తే... ఆ ఉద్యోగి మాత్రం మహిళతో ఎంట్రీ ఇస్తాడు : (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments