Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెర నటి, యాంకర్ అనుమానాస్పద మృతి, ఆ అపార్టుమెంట్లో ఆమె ఒక్కతే...

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:13 IST)
టీవీ యాంకర్, సీరియల్స్‌ నటి విశ్వశాంతి అనుమానాస్పదంగా మృతి చెందారు. గత నాలుగు రోజులుగా తన నివాసం నుంచి ఆమె బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగువారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇంట్లోకి వెళ్లి చూడగా విశ్వశాంతి అనుమానాస్పదంగా చనిపోయి కనిపించింది. 
 
ఆమె హైదరాబాద్ నగరంలోని ఎల్లారెడ్డి గూడలో ఉన్న ఇంజనీర్స్ కాలనీలో నివాసం ఉంటుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ఆమె ఇంటికే పరిమితమైంది. అయితే, గత నాలుగు రోజులుగా ఆమె ఇంటి నుంచి బయటకు రాలేదు. 
 
దీంతో అనుమానం వచ్చిన పొరుగువాళ్లు ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విశ్వశాంతి మృతదేహాన్నిపోస్టుమార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
 
కాగా, విశ్వశాంతి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమె నివసిస్తున్న అపార్టుమెంట్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. గత మూడేళ్లుగా ఆ అపార్టుమెంట్‌లో విశ్వశాంతి నివసిస్తోంది. ఆమె స్వస్థలం విశాఖ జిల్లాగా పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments