ఎదగడానికి కాంప్రమైజ్... ఎదిగాక #MeToo : ఎమ్మెల్యే ఉషా ఠాకూర్

Webdunia
సోమవారం, 15 అక్టోబరు 2018 (15:06 IST)
#MeToo ఉద్యమం దేశంలో ఓ స్థాయిలో వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆయా రంగాల్లో పనిచేస్తున్న మహిళల్లో కొందరు తమకు ఎదురైన చేదు అనుభవాలను వరుసగా చెప్పేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, గీత రచయిత వైరముత్తు, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను వేధించారంటూ పలువురు మహిళలు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు నటులు షూటింగులకు రావడంలేదు. మరికొందరు తమ పదవులకు రాజీనామాలు కూడా చేశారు. 
 
ఐతే దీనిపై మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కెరీర్‌లో ఎదుగుదల కోసమో లేదంటే సొంత ప్రయోజనాల కోసమో కొందరు మహిళలు ఆ విషయంలో రాజీ పడతారంటూ చెప్పుకొచ్చారు. చేస్తున్న ఉద్యోగంలో లేదంటే వ్యాపారంలో వున్నత స్థానానికి వెళ్లేందుకు మహిళల్లో కొందరు విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేస్తుంటారని వ్యాఖ్యానించారు. అలా ఆనాడు ప్రయోజనాలు పొందేసి తీరా పైకి వచ్చాక మీ టూ అంటూ ఉద్యమాన్ని దుర్వినియోగం చేస్తున్నారటంటూ ఆరోపించారు. 
 
ఈ నేపధ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత మహిళలు. కానీ సదరు ఎమ్మెల్యే ఉష మాత్రం అవేమీ పట్టించుకోవడంలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Sirish wedding: అల్లు శిరీష్- నయనిక వెడ్డింగ్.. ఒకే ఫోటోలో చెర్రీ, బన్నీ

Uday kiran Wife: ఉదయ్ కిరణ్ భార్య విషిత ఏం చేస్తున్నారంటే?

Tripti Dimri: బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి నాయికగా బిజీ అయిపోయింది

Nithya Menen: కథలు చెప్పడంకంటే సినిమా తీయడం ఇష్టం : నిత్యా మీనన్

Rashmika: రష్మికమందన్న వివాహంపై ప్రమోద్ శెట్టి వ్యాఖ్యల వివాదం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయానికి మేలు చేసే పసుపు కలిపిన ఉసిరి రసం, ఇంకా ఏమేమి ప్రయోజనాలు?

మంచి కోడిగుడ్లు, మంచి పాలు వెతుక్కోవాల్సి వస్తోంది, ఎందుకంటే?

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

తర్వాతి కథనం
Show comments