Revanth Reddy: సినిమా వాళ్లకు రేవంతన్న వార్నింగ్.. టికెట్ ధరలు, బెనిఫిట్ షోలుండవు..

సెల్వి
శనివారం, 21 డిశెంబరు 2024 (16:48 IST)
Revanth Reddy
పుష్ప -2 బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. సినిమా రంగ అభివృద్ధికి ప్రోత్సాహం చేస్తాం అంటూనే.. ప్రజల ప్రాణాలతో చెలగాడితే ఎట్టి పరిస్థితుల్లో సీఎం కుర్చీలో కూర్చున్నంతవరకు ఒప్పుకునేది లేదంటూ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. ఆ వెంటనే సినీమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపులను బెనిఫిట్ షోలను బ్యాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 
 
అయితే ప్రభుత్వ ఈ నిర్ణయం పై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మద్దతు తెలపడం విశేషం. సంధ్య థియేటర్‌కు వెళ్లే ముందు రోడ్ షో చేసుకుంటూ వెళ్లిన అల్లు అర్జున్.. రేవతి అనే మహిళ మరణించిందని బయటికి వెళ్లాల్సిందేనని పోలీసులు చెప్పాక కూడా.. కారు టాప్ తీసి అభిమానులకు అభివాదం చేస్తూ వెళ్లాడని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రోడ్ షోల కారణంగా తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు.
 
అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు.. బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది.. హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు. 
 
థియేటర్‌లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. సెలెబ్రిటీలు విమర్శించడం ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments